ఇక రెండవ వ్యూహం బస్సు యాత్రని చేస్తున్నారు. మేమంతా సిద్ధం అనే పేరుతో ఆ చివరి నుంచి ఈ చివరిదాకా యాత్రను కొనసాగిస్తూ ఉన్నారు. రోజుకొక జిల్లా చొప్పున 25 పార్లమెంటు స్థానాలకు గాను ఆయా లెక్కల ప్రకారం జిల్లాల వారీగా పర్యటన చేసుకొస్తున్నారు. ఇది కూడా త్వరలోనే పూర్తి కాబోతోంది. తూర్పుగోదావరి, అనకాపల్లి, విశాఖపట్నం ఇలా తన రూట్ మ్యాప్ ప్రకారం ఐదారు రోజుల్లో మేమంతా సిద్ధం సభ కూడా పూర్తి కాబోతోంది.
మేమంతా సిద్ధం సభ పూర్తి అవ్వగానే హెలిఫ్ కాటర్ టూర్ అనేది మరొక వ్యూహం మొదలు పెట్టబోతున్నారు.హెలిఫ్ కాటర్ లో రోజుకి మూడు నుంచి నాలుగు సభలకు ఏర్పాట్లు చేసుకొని ముందుకు వెళ్లబోతున్నారు జగన్. ఉదయం 10కి ఒకటి, 12కి మరొకటి.. సాయంత్రం 3కి ఒకటి ,5 ఇంటికి ఒకటి ఇలా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇతరుల మీద ఆధారపడకుండా కేవలం తను తన మనుషులే అన్నట్లుగా ఈ వ్యూహాల రూట్లోనే జగన్ ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తున్నారు. త్వరలోనే మేనిఫెస్టో విడుదల చేసేందుకు కూడా పలు రకాల కసరత్తులు చేస్తున్నట్లుగా వైసిపి నేతల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అందరినీ ఆకట్టుకునే విధంగా ఈ మేనిపోస్ట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.