అయితే గతంలో విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా కూడా ఈమె పేరును గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి ఆమె నిరాకరించడంతో.. ఇప్పుడు సుంకర పద్మజా ప్లేసులో విజయవాడ ఈస్ట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మరోక అభ్యర్థిని ప్రకటించాల్సి ఉన్నది.. 38 మంది అభ్యర్థుల పేరుతో సోమవారం రోజున ఒక జాబితాని కూడా విడుదల చేశారు. ఇందులో మళ్లీ పదిమంది అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ పేరు మార్చి మరో కొత్త నేతలకు అవకాశాన్ని కలిగించింది. దీంతో చాలా మంది నేతలలో నిరసనలు కూడా కనిపిస్తున్నాయి.
విజయవాడ పార్లమెంట్ టిడిపి పార్టీ నుంచి కేశినేని చిన్ని వైసీపీ తరఫున కేసినేని నాని కూడా పోటీ పడుతున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వల్లూరు భార్గవ్ కూడా పోటీ చేయబోతున్నారు. విజయవాడ ఈస్ట్ నుంచి టిడిపి పార్టీ నుంచి గద్దె రామ్మోహన్.. వైసీపీ నుంచి దేవినేని అవినాష్ వంటి నేతలు పోటీ చేస్తున్నారు. మరి రేపటితో నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి కాబోతోంది. కాంగ్రెస్ పార్టీలో మరి ఎవరెవరు ఇంకా తప్పకుంటారో చూడాలి మరి.