పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్టు క్లారిటీ రావడంతో కాకినాడ ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాసుని ప్రకటించాల్సి వచ్చింది. అయితే ఈ విషయం శ్రీనివాస్ ని బాగా బాధించిందని సమాచారం. ఇకపోతే పిఠాపురంలో వ్యవహారం అంతా కూడా చంద్రబాబు డైరెక్షన్లోనే జరుగుతోందని, తమను కాదని పవన్ ఇక్కడ ఏ నిర్ణయమూ తీసుకోలేరని గుసగుసలు వినబడుతున్నాయి. దానికి ఇపుడు ఉదయ్ శ్రీనివాస్ సంఘటనే కారణం అని తెలుస్తోంది. జనసేన నుంచి ఉదయ్ శ్రీనివాస్ను కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం టీడీపీ సరికొత్త రాజకీయానికి తెర తీసినట్టు కనబడుతోంది.
ఇపుడు ఇదే అంశం జనసేన కార్యకర్తలకు మింగుడు పడడం లేదు. మరోవైపు పట్టుమని పది మందితో కూడా పరిచయం లేని శ్రీనివాస్ను ఏకంగా ఎంపీ అభ్యర్థిని చేసేయడమేమిటని టీడీపీ నేతలు, ఆ పార్టీ అభ్యర్థులు వాదనకి తెరలేపుతున్నారు. ఈ రాజకీయమంతా బాబుగారే స్వయంగా లేపుతున్నట్టు విశ్లేషకులు అనుకుంటున్నారు. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో పిఠాపురం, కాకినాడ రూరల్ నుంచి జనసేన పోటీ చేస్తోంది. మినహా మిగిలిన 5 నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉదయ్ శ్రీనివాస్ను మార్చాలని గట్టిగా పట్టు బడుతున్నట్టు కనబడుతోంది. ఉదయ్ శ్రీనివాస్ స్థానంలో టీడీపీ సానుభూతిపరుడైన సానా సతీష్ను తెర మీదకు తీసుకుని వచ్చేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇపుడు ఇదే అంశం పవన్ కి నచ్చలేదు!