ఇప్పుడు తాజాగా అనకాపల్లి ఎంపీ అభ్యర్థి విషయంలో ఇదే జరిగింది.. నామినేషన్ దాఖలు చేసేందుకు ఈరోజే చివరి రోజు కావడంతో ఎంపీ అభ్యర్థిని మారుస్తూ వైసిపి పార్టీ మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మేరకు అభ్యర్థి గా బి శేట్టి సత్యవతికి బీఫామ్ అందజేసినట్టుగా తెలుస్తోంది. మొదట వైసీపీ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థుల లిస్టులో ఆ సీటును బూడి ముత్యాల నాయుడు కి కేటాయించారు. అయితే ఇప్పుడు ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఉన్నట్టుండి వైసిపి పార్టీ మరో నిర్ణయం తీసుకుంది.
ఈ సీట్ ని సీఎం జగన్ బి శెట్టి సత్యవతికి కేటాయించారు. అనకాపల్లి పార్లమెంటులో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే చివరి నిమిషంలో వైసిపి పార్టీ ఇలా చేయడంతో అక్కడ రాజకీయ నేతలు కాస్త కుర్రుగా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో టిడిపి పార్టీ కూడా ఎంతోమంది అభ్యర్థులను మార్చారు.. ఇప్పటికే కూడా పలు రకాల నియోజకవర్గాలలో అసంతృప్తులు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. వైసీపీ పార్టీలో చాలా తక్కువ అసంతృత్తులు ఉన్నాయి.. ప్రస్తుతం అభ్యర్థులు కూడా తమ నియోజకవర్గాలలో అందరిని కలుపుకొని ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు.