హిందూపురం, కుప్పం, నగరి నియోజకవర్గాలు కూటమికి అనుకూలంగా ఉండటం గమనార్హం. మైదుకూరు, బనగానపల్లె నియోజకవర్గాల్లో కూడా కూటమి అభ్యర్థులే విజేతగా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. సీమలో వైసీపీ కూటమిని తొక్కుకుంటూ పోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కనీసం 88 స్థానాలలో విజయం సాధించాల్సి ఉంటుంది.
రాయలసీమ నుంచి 40 నుంచి 45 స్థానాలలో విజయం దక్కుతుందని వైసీపీ భావిస్తుండటం గమనార్హం. ఉత్తరాంధ్ర, ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు జిల్లాలలో సైతం తమ పార్టీదే హవా హవా ఉంటుందని మిగతా జిల్లాలలో కనీసం 50 శాతం స్థానాలలో విజయం దక్కుతుందని ఈ పార్టీ భావిస్తోంది. అయితే కూటమి నేతలకు సైతం ఏపీలో అధికారం విషయంలో సొంత లెక్కలు ఉన్నాయి.
ఏపీలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందో కూటమి అధికారంలోకి వస్తుందో చూడాల్సి ఉంది. ఎన్నికలకు కేవలం రెండు వారాల సమయం ఉన్న నేపథ్యంలో జగన్ ప్రచారం విషయంలో మరింత వేగం పెంచారు. రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున ప్రచారం చేసేలా ప్లాన్ చేసుకున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లతో పోలిస్తే సీఎం జగన్ ప్రచారానికి సంబంధించి సరైన దారిలో నడుస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరో రెండు రోజుల్లో జగన్ వైసీపీ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. మేనిఫెస్టోలో రుణమాఫీ లాంటి హామీలు ఉంటే మాత్రం వైసీపీకి కచ్చితంగా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.