ఏపీలో జరగబోతున్న ఎన్నిక వేళ ఎన్నో వింతలూ విశేషాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాడికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని ఇపుడు టీడీపీ అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఈ విషయం ఆ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి కాస్త మింగుడు పడడంలేదని గుసగుసలు వినబడుతున్నాయి. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ విషయంలోనే ఆమెని వైసీపీ సస్పెండ్ చేయగా.. ఆ తర్వాత టీడీపీలో చేరడం జరిగింది.

తరువాత ఆమె బాపట్ల ఎంపీ టికెట్ ఆశించి భంగపడింది. ఇక టీడీపీలో చేరిన చిలకలూరిపేట వైసీపీ నేత మల్లెల రాజేశ్‌నాయుడునుని రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్టు అచ్చెన్నాయుడు ఓ మీడియా వేదికగా స్పష్టం చేయడం జరిగింది. కాగా ఈ విషయం పార్టీ నేతల్లో కొంతమందికి అసహనాన్ని కలిగించినట్టుగా వార్తలు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు జగన్ పంచన చేరి బాబు గారిని తిట్టిన ఉండవల్లి శ్రీదేవికి నేడు పార్టీ ఆ రకమైన స్థాయిని ఇవ్వడం మింగుడు పడడంలేదు. దాంతో ప్రస్తుతం వారిని కూల్ చేసే పనిలో పడ్డారు మిగతా  నాయకులు.

ఇకపోతే, ఉండవల్లి శ్రీదేవి 1969లో గుంటూరు జిల్లా, తాడికొండలో జన్మించింది. మొదటినుండి చదువులో ముందున్న ఆమె 1993లో బెంగళూరు ఎంబీబీఎస్ పూర్తి చేయడం గమనార్హం. తండ్రి ఉండవల్లి సుబ్బారావు 1978లో తాడికొండ నుంచి రెడ్డి కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన సంగతి అందరికీ తెలిసినదే. శ్రీదేవి 2017లో వైసీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, తాడికొండ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా పని చేసింది. ఈ క్రమంలో తన నియోజక వర్గంలో వైద్య శిబిరాలు, రాజన్న క్యాంటీన్‌ లాంటి కార్యక్రమాలతో ప్రజలకు బాగా చేరువైంది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్‌కుమార్ పై 4 వేల 433ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టింది.


మరింత సమాచారం తెలుసుకోండి: