గతంలో కోట్ల కుటుంబం మొత్తం కాంగ్రెస్లో ఉండేది. అయితే రాష్ట్ర విభజన తర్వాత కోట్ల కుటుంబం టీడీపీలో చేరింది. 2019లో కోట్ల సుజాతమ్మ ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలు నుంచి ఎంపీగా టీడీపీ నుంచి నిలబడ్డారు. అయితే ఆ ఎన్నికల్లో వారు పరాజయం పాలయ్యారు. అయితే నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ, వారికి అండగా కోట్ల సుజాతమ్మ నిలబడేవారు. ఇక కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని డోన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటికే అక్కడ బలమైన బీసీ నేతలు కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రతాప్ కుటుంబాలు కోట్ల అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నాయి. దీంతో బీసీల బలం ఆయనకు లభించనుంది. అంతేకాకుండా ప్రజల్లో మనిషిగా కలిసిపోయే కోట్ల సుజాతమ్మ ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. భర్త విజయం కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. తాము నియోజకవర్గంలో చేసిన మంచి, అభివృద్ధి తమను గెలిపిస్తాయని ఆమె నమ్ముతున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి వైసీపీ వెళ్లిన నాయకులు, కార్యకర్తలందరినీ తమ వైపు తిప్పుకోవడంలో ఆమె సఫలం అయ్యారు. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డికి గుబులు పుట్టిస్తున్నారు.
గతంలో కోట్ల కుటుంబం మొత్తం కాంగ్రెస్లో ఉండేది. అయితే రాష్ట్ర విభజన తర్వాత కోట్ల కుటుంబం టీడీపీలో చేరింది. 2019లో కోట్ల సుజాతమ్మ ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలు నుంచి ఎంపీగా టీడీపీ నుంచి నిలబడ్డారు. అయితే ఆ ఎన్నికల్లో వారు పరాజయం పాలయ్యారు. అయితే నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ, వారికి అండగా కోట్ల సుజాతమ్మ నిలబడేవారు. ఇక కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని డోన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటికే అక్కడ బలమైన బీసీ నేతలు కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రతాప్ కుటుంబాలు కోట్ల అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నాయి. దీంతో బీసీల బలం ఆయనకు లభించనుంది. అంతేకాకుండా ప్రజల్లో మనిషిగా కలిసిపోయే కోట్ల సుజాతమ్మ ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. భర్త విజయం కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. తాము నియోజకవర్గంలో చేసిన మంచి, అభివృద్ధి తమను గెలిపిస్తాయని ఆమె నమ్ముతున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి వైసీపీ వెళ్లిన నాయకులు, కార్యకర్తలందరినీ తమ వైపు తిప్పుకోవడంలో ఆమె సఫలం అయ్యారు. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డికి గుబులు పుట్టిస్తున్నారు.