2019లో సాధించిన పట్టును నిలుపుకోవడానికి వైసిపి ప్రభుత్వం పలు రకాల వ్యూహాలను రచిస్తోంది. అప్పటి ఎన్నికలలో వైసీపీ పార్టీ 151 అసెంబ్లీ, 22 లోక్సభ స్థానాలను కూడా గెలుచుకున్నది. ఈ సంఖ్యను మరింత పెంచే ప్రయత్నం అయితే ఇప్పుడు చేస్తోంది. వైసిపి పార్టీకి అడ్డుకట్ట వేయడానికి టిడిపి పార్టీ ఎన్నో సాయి శక్తుల ప్రయత్నిస్తూనే ఉంది. ఇందులో భాగంగా జనసేన బీజేపీ పార్టీలతో పొత్తు పెట్టుకుని మరి ఈసారి అధికార పార్టీ వైసీపీని ఎదుర్కొనేందుకు భాగస్వామ్యం అయ్యాయి. అయినా కూడా ఎక్కడో ఒకచోట భయం అనేది కనిపిస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో హీరోయిన్ పూనమ్ కౌర్ ఒక ట్విట్ సంచలనంగా మారుతోంది. సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉండే పూనమ్ కౌర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పైన ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది.. తాజాగా ఇప్పుడు మరొకసారి అలాంటి కామెంట్స్ చేసింది. ఏపీని ఉత్తరప్రదేశ్తో పోలుస్తూ ఏపీ ఈజ్ ద న్యూ యూపీ అంటూ కామెంట్స్ పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏపీ కొత్త ఉత్తరప్రదేశ్గా అవతరిస్తాబోతోంది అంటూ ఆమె అభివర్ణించింది. అయితే దీనిపైన చాలామంది ట్విట్టర్లో అటు వైసీపీ, టీడీపీ, జనసేన అభిమానులు కూడా రిప్లైలు ఇస్తున్నారు. మరి పూనమ్ కౌర్ చేసిన ఈ ట్విట్ కి గల కారణం ఏంటా అంటూ అభిమానులు తెలియక జుట్టు పీక్కుంటున్నారు.