తెలంగాణలోని చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నిలిపింది. 2009లో డీలిమిటేషన్ తర్వాత చేవెళ్ల ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బీజేపీ ఈ స్థానాన్ని గెలుచుకోలేకపోయింది. ఈయన తన అఫిడవిట్లో సమర్పించిన భారీ ఆస్తులతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి 2019లో తన ఆస్తుల విలువ రూ.895 కోట్లుగా ప్రకటించారు. ఈసారి ఆయన సంపద రూ.1,240 కోట్లకు పెరిగిందని, ఆయన కుటుంబం మొత్తం సంపద రూ.4,568 కోట్లుగా ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు. అఫిడవిట్ ప్రకారం కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఆయన భార్య సంగీతారెడ్డి, కుమారుడు కె. వైరా మాధవరెడ్డికి మొత్తం రూ.4,568 కోట్ల విలువైన చర, స్థిరాస్తులు ఉన్నాయి. చరాస్తులలో ఎక్కువ భాగం అపోలో హాస్పిటల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ షేర్లలో ఉన్నాయి. కొండా విశ్వేశ్వర రెడ్డికి రూ.973.22 కోట్ల షేర్లు ఉండగా, ఆయన భార్యకు రూ.1,500.85 కోట్ల షేర్లు ఉన్నాయి.
తెలంగాణలోని చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నిలిపింది. 2009లో డీలిమిటేషన్ తర్వాత చేవెళ్ల ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బీజేపీ ఈ స్థానాన్ని గెలుచుకోలేకపోయింది. ఈయన తన అఫిడవిట్లో సమర్పించిన భారీ ఆస్తులతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి 2019లో తన ఆస్తుల విలువ రూ.895 కోట్లుగా ప్రకటించారు. ఈసారి ఆయన సంపద రూ.1,240 కోట్లకు పెరిగిందని, ఆయన కుటుంబం మొత్తం సంపద రూ.4,568 కోట్లుగా ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు. అఫిడవిట్ ప్రకారం కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఆయన భార్య సంగీతారెడ్డి, కుమారుడు కె. వైరా మాధవరెడ్డికి మొత్తం రూ.4,568 కోట్ల విలువైన చర, స్థిరాస్తులు ఉన్నాయి. చరాస్తులలో ఎక్కువ భాగం అపోలో హాస్పిటల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ షేర్లలో ఉన్నాయి. కొండా విశ్వేశ్వర రెడ్డికి రూ.973.22 కోట్ల షేర్లు ఉండగా, ఆయన భార్యకు రూ.1,500.85 కోట్ల షేర్లు ఉన్నాయి.