ఈ పోస్టల్ బ్యాలెట్ ను సంబంధించి ఒక రికార్డు నమోదయింది.. ఈసారి ఏకంగా 5 లక్షల మంది ఉద్యోగులు ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను ఉపయోగించబోతున్నారు. ఈనెల 5, 6 ,7 ,8 తేదీల్లో పనిచేసే జిల్లాల్లోనే తమ ఓటు హక్కును సైతం వినియోగించుకోనున్నారు. ఈ విషయం పైన ఈసి కూడా అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేసింది. దాదాపుగా 5 లక్షల మందికి పైగా ఎన్నికలలో పాల్గొని ఉద్యోగస్తులకు అందులో 4,50,000 మంది పోస్టల్ ఓటింగ్కి దరఖాస్తు చేసుకున్నారట.
అంగన్వాడీలతో పాటు మరొక 50,000 మంది మాత్రం ఇవ్వరు.. అయితే వీరు ఎక్కడికక్కడే ఓటింగ్ వేసుకొని అవకాశం ఉంటుంది.. కాబట్టి ఈ నాలుగు లక్షల 50 వేల మంది వినియోగించుకోనున్నారు.. సాధారణంగా ఈ ఓట్లన్నీ కూడా వైసీపీకి వ్యతిరేకంగానే ఉంటాయని ఆశ పడుతున్నాయి మిగిలిన పార్టీ నేతలు.. ఈ ఎన్నికల తోని అధికారంలోకి ఏ పార్టీ వస్తుందని విషయం పైన కూడా కాస్త అంచనా వేయొచ్చని పలువురు నేతలు కూడా తెలియజేస్తున్నారు. మరి ఉద్యోగులు ఎవరి పక్షాన ఉన్నారా తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు వాడివేడుగా ముందుకు కొనసాగుతున్నాయి.