తెలుగు మీడియా చరిత్రలోనే ఇదొక సంచలనం.. ప్రముఖ మీడియా సంస్థ ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ నేడు జరగనున్నది.. తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనం సృష్టించడం ఖాయం. ఎందుకంటే ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే మామూలు విషయం కాదు. ఇది నిజంగా చాలా పెద్ద విషయం. ఇప్పుడు ఆ ఘనత ప్రముఖ మీడియా సంస్థ ఎన్టీవీకి దక్కింది. ఫర్ ది ఫస్ట్ టైం ఎన్టీవీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. తన మనసులోని మాటను ప్రధాన మంత్రి మోడీ ఎన్టీవీతో పంచుకోనున్నారు. అది కూడా ఎప్పుడో కాదు.. నేటి రాత్రి 8 గంటలకు ప్రధాని మోడీ ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారని ఇండియా హెరాల్డ్ కి సమాచారం తెలిసింది. పదేళ్ల నుంచి తిరుగులేని విజయాలను సాధిస్తూ భారతదేశ ప్రజల గుండెలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న ప్రధాని మోడీ.. నేడు ఎన్టీవీతో ఈ సార్వత్రిక ఎన్నికల ముచ్చట్ల గురించి మాట్లాడబోతున్నారు.


ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల వేళ మీడియాకు అతి తక్కువ సమయం మాత్రమే ఇవ్వగలిగేంత బిజీ షెడ్యూల్‌లో కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వడం గమనార్హం. ఇక పోతే గతంలో భక్తి టీవీ నిర్వహించిన కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా ప్రధాన మంత్రి మోడీ హాజరవ్వడం జరిగింది.ఎన్నికలు అతి సమీపంలో వున్న ఈ కీలక సమయంలో ఎన్టీవీకి మన ప్రధాన మంత్రి ఇంటర్వ్యూ ఇవ్వడమనేది తెలుగు మీడియా కుటుంబానికి చాలా పెద్ద విషయం. ఆ ప్రకారం చూసుకుంటే ఎన్టీవీ తెలుగు మీడియా తరుపున దేశ టెలివిజన్‌ చరిత్రలోనే అరుదైన ఘనతను సాధిస్తోందని చెప్పొచ్చు.తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జరుగుతున్న కీలక పరిణామాలపై ప్రధాన మంత్రి మోడీ సమాధానమివ్వనున్నారు. ప్రజల మెదళ్లలో నానుతున్న ఎన్నో ప్రశ్నలు, ప్రచారంలో ఉన్న మరెన్నో సందేహాలపై తెలుగు ప్రజల తరపున ఎన్టవీ ప్రశ్నించనుందని ఇండియా హెరాల్డ్ కి సమాచారం తెలుస్తుంది. ఒకే ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దగ్గర కానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: