ప్రస్తుతం భారతదేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు పూర్తయ్యాక ప్రధానమంత్రి ఎవరనేది తెలుస్తుంది. ఈ ఓటింగ్ వ్యవస్థ ద్వారా ప్రజలు తమకు నచ్చే, తమకి ఇష్టమైన పరిపాలనను ఎన్నుకోవచ్చు. ఇలాంటి ప్రజాస్వామ్యం ఎన్నికల వ్యవస్థ ఈరోజు అమల్లో ఉంది అంటే దానికి ఎంతోమంది స్వాతంత్ర్య పోరాట యోధుల ప్రాణత్యాగాలే కారణమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరనారి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో పోరాటం చేశారు. మరాఠా కుటుంబంలో జన్మించిన ఆమె, బ్రిటిష్ పాలన నుంచి భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడింది. 1857 భారత తిరుగుబాటులో ఆమె ముఖ్య పాత్ర పోషించింది. ఈ రివోల్ట్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక గొప్ప తిరుగుబాటు. అందుకే మనదేశ స్వాతంత్ర్యానికి పాటుపడిన వారిలో లక్ష్మీబాయిని ప్రజలు ప్రత్యేకంగా గుర్తుంచుకుంటారు.

1828 నవంబర్ 19 న వారణాసి నగరంలో ఆమె జన్మించింది. ఆమె పుట్టిన పేరు మణికర్ణిక తాంబే, ఆమెను కుటుంబ సభ్యులు ముద్దుగా మాను అని పిలిచేవారు. భారతదేశంలో బ్రిటిష్ నియంత్రణకు వ్యతిరేకంగా రాణి లక్ష్మీబాయి చేసిన పోరాటాన్ని ఇప్పటికీ ప్రజలు తలుచుకుంటారు. భారతావని స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవడానికి లేదా ఓటింగ్ కోసం వ్యవస్థను ఏర్పాటు చేయడంలో ఆమె నేరుగా పాటుపడలేదు. కానీ ఆమె ధైర్య పోరాటం భారతదేశం స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం రాజ్యం కోసం అడుగులు వేసేలా ప్రోత్సహించింది. ఆమె చర్యలు చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి. భారతీయులలో ఐక్యతా భావాన్ని పెంపొందించాయి.

భారతదేశ ఓటింగ్ వ్యవస్థను రూపొందించడంలో ఆమె హస్తం ప్రత్యక్షంగా లేనప్పటికీ, స్వాతంత్ర్యం కోసం ఆమె చేసిన పోరాటం నేడు మనకు తెలిసిన ప్రజాస్వామ్య భారతదేశానికి పునాది వేసింది. ఆమె ధైర్యం చాలామందిని కదిలించింది. స్వపరిపాలన కోసం కోరిక ప్రజలలో రగిలించింది. కాబట్టి, భారతదేశ ప్రజాస్వామ్య ప్రయాణంలో ఆమె పాత్ర ఎంతో కీలకమైనదని చెప్పుకోవచ్చు, 1947లో స్వాతంత్ర్యంతో వచ్చిన భవిష్యత్ ఓటింగ్ వ్యవస్థకు మార్గం చూపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: