
దీనితో నగరిలో రోజాకు చేదు అనుభవం ఎదురైంది . రెండు సార్లు వరుసగా విజయం సాధించిన ఆమె మూడోసారి నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఆమె లక్ష్యం నేరవేరనివ్వకుండా ఆమెను ఎలాగైనా ఓడించేలా సొంత పార్టీ నేతలే ప్రవర్తిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో రోజాకు ప్రజల నుంచేకాక సొంత పార్టీ నేతల నుంచి నిరసన సెగ ఎదురవుతుంది. ఈ సారి ఎన్నికలలో రోజా కచ్చితంగా ఓడుతుందని ప్రచారం చేస్తున్నారు.నగరి నియోజకవర్గంలో మెజారిటి వైసీపీ నేతలు తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ కూటమికి మద్దతు ప్రకటిస్తున్నారని మంత్రి రోజా ఆరోపించారు. నగరిలో తనను ఓడించేందుకు కొందరు వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తుంది.ఆమె చెప్పారు. జగన్ నుంచి నామినేటెడ్ పదవులు తీసుకున్న కేజే కుమార్ మరియు ఆయన వర్గీయులు తన ఓటమి కోసం టీడీపీ నేతల కంటే ఎక్కువగా పని చేస్తున్నారని చెప్పి రోజా ఆవేదన వ్యక్తం చేశారు.