అయితే ఈ సమయంలోనే చంద్రగిరి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి నాని పద్మావతి యూనివర్సిటీలో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్ ని సైతం పరిశీలించారు .. అయితే అనంతరం తిరిగి వస్తూ ఉండగా ఆయన పైన వైసిపి కార్యకర్తలు ఒక్కొక్కరుగా రాళ్లు , కర్రలతో దాడి చేసినట్లు తెలుస్తోంది.. దీంతో ఆయన కారు అక్కడికక్కడే ధ్వంసం అయినట్లుగా సమాచారం. అయితే అప్పటికి ఆయన వెంట ఉండి తిరిగిన వారు తిరగబడడంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.
ఆ తర్వాత టిడిపి మహిళా నేతలు యూనివర్సిటీ ఎదుట రహదారి పై బైఠాయించి కులపర్తి నాని పైన జరిగిన ఈ దాడిని సైతం వ్యతిరేకిస్తూ పలు రకాల నిరసనలను కూడా తెలియజేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడి చేరుకొని అక్కడ పరిస్థితిని సైతం చక్కదిద్దే ప్రయత్నం చేశారు.. అయితే వైసిపి దాడిలో ఎవరికైనా గాయాలు అయ్యాయా లేవా అనే విషయం పైన ఇంకా పోలీసులు ఆరా తీస్తున్నారు.. ఓటింగ్ రోజున కూడా ఇలాంటి పరిస్థితులే కనిపించాయి .. ఇప్పుడు ఓటింగ్ అయిపోయిన కూడా ఇలాంటి పరిస్థితులే కనిపించడంతో చాలామంది ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు.. ముఖ్యంగా ఇప్పటివరకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు యుద్దాలను తలపిస్తూ ఉండడం ప్రజలను మరింత ఇబ్బందులకు భయాందోళనలకు గురి చేస్తున్నాయని చెప్పవచ్చు.