ఎక్కడ చూసినా ఇప్పుడు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు.. ఇటీవలే తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో మరొకసారి జగనన్నే గెలుస్తాడని జోష్యం చెప్పారు.. అందుకు కారణం ఆయన చేసిన మంచి పనులే ఆయనను నిలబెడతాయని తెలిపారు.. కూటమి ఎలాగైనా గెలవాలని ప్రయత్నాలు చేస్తోంది.. ఒకవేళ ఓడిపోతే తమ ఉనికి ఉండదని భయంతోనే ఎన్నోపన్నాగాలు పన్నుతున్నాయని చెప్పవచ్చు. ఏపీ సీఎం జగనే అంటూ తమకు సమాచారం అందింది అని కూడా ఎమ్మెల్యే కేటీఆర్ తెలియజేశారు.
అయితే బిఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే తరహాలోనే ఎన్నోసార్లు వ్యాఖ్యలు కూడా తెలియజేశారు.. ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వమే ప్రజలు కోరుకుంటున్నారని కెసిఆర్ తమ అభిప్రాయంగా అన్నట్లుగా కూడా తెలియజేశారు. ఇప్పుడు కేటీఆర్ కూడా జగనే గెలుస్తారని చెప్పడంతో ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కేటీఆర్ కెసిఆర్ చెప్పినవి నిజమవుతాయో లేదో తెలియాలి అంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.. ప్రస్తుతం బెట్టింగ్ రాయుళ్లు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పైన భారీగానే బెట్టింగ్ వేస్తున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా పిఠాపురం, మంగళగిరి ,కుప్పం ఇతర ప్రాంతాలతో పాటు ఎవరికీ ఎక్కువ సీట్లు వస్తాయి ఎవరు అధికారం చేపడతారని విషయం పైన ఎక్కువగా బెట్టింగ్ వేస్తున్నట్లు తెలుస్తోంది.