అయితే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇటీవలే వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో కూడా తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం రేవంత్ తీవ్రంగా శ్రమించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇక తమ పార్టీ అభ్యర్థుల తరఫున రోడ్ షోలు నిర్వహిస్తూ ఇక బిజీబిజీగా గడిపారు అని చెప్పాలి. అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో భారీగా మార్పులు ఉండే అవకాశం ఉంది అని అందరూ అంచనా వేశారు. అయితే అందరూ అనుకున్నట్లుగానే ఇక ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో భారీ మార్పులు జరగబోతున్నాయి అన్నది తెలుస్తుంది.
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ పదవికి ఇక రేవంత్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇక మరో కీలక నేత పగ్గాలు చేపట్టబోతున్నాడట. ఈ క్రమంలోనే ఈ పదవిని ఆశిస్తున్న వారిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మధు యాష్కి గౌడ్, జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ రేస్ లో ఉన్నారు అన్నది తెలుస్తుంది. మరి వీరిలో ఎవరికి ఇక పార్టీ పగ్గాలు దక్కబోతున్నాయి అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇక టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ దిగిపోయిన తర్వాత పార్టీలో ఏం జరగబోతుంది అనే విషయంపై కూడా ఉత్కంఠ నెలకొంది అని చెప్పాలి.