రాజకీయాలు పక్కన పెడితే మెగా కుటుంబ సభ్యులు అంటే తనకు చాలా గౌరవం అన్నట్లుగా కూడా తెలియజేసింది. అలాగే వాళ్లకు కూడా తన పట్ల మంచి గౌరవం ఉందని వంగా గీత వెల్లడించింది. అందువల్లే పిఠాపురం ఎన్నికల ప్రచారంలో భాగంగా తనపైన ఎలాంటి వ్యక్తిగత విమర్శలు కూడా చేయలేదని తెలిపింది.. ఏపీ ఎన్నికల బరిలో పిఠాపురం లో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తిగా మారింది. ఒకవేళ పిఠాపురంలో వైసీపీ పార్టీ గెలిస్తే వంగా గీత కు డిప్యూటీ సీఎం ఇస్తానని జగన్ కూడా బంపర్ ఆఫర్ ప్రకటించారు.
అందుచేతనే ఈసారి మరింత ఉత్కంఠంగా పిఠాపురం ఎన్నికలు మారాయి. ముఖ్యంగా ఈసారి ఎన్నికలు కూడా ఒక యుద్ధ వాతావరణం తలపించాయి. ఎవరు అధికారంలోకి వస్తారనే విషయం పైన క్లారిటీ చెప్పలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల పైన బయట భారీగానే బెట్టింగులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన సీట్ల విషయం పైన కూడా కొన్ని కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం. మొత్తానికి ఎవరు గెలుస్తారనే విషయం జూన్ 4వ తేదీ తెలుస్తుంది. మరి ప్రజలు ఎవరిని సీఎంగా ఎంచుకుంటారా చూడాలి మరి.