ఆ తర్వాతే జగన్ లండన్ కి వెళ్ళిపోయిన వాటి పైన చర్చ జరుగుతూనే ఉంది. 2019లో సాధించిన 151 అసెంబ్లీ స్థానాలకు 22 ఎంపీ స్థానాలకు మించి సీట్లు వస్తాయనే విధంగా తెలుపుతున్నారు.. ముఖ్యంగా తమ ఐదేళ్ల పాలనలో ఎప్పుడూ చూడని విధంగా దేశ మొత్తం ఈ ఎన్నికలు ఏపీ వైపే చూస్తుందంటూ తెలియజేశారు. అయితే జగన్ చేసిన వ్యాఖ్యల పైన తెలుగుదేశం పార్టీ నుంచి పెద్దగా ఎక్కడ కౌంటర్లు రాలేదు.. అందుకే జగన్ ధీమా పైన కూడా చర్చ జరుగుతున్నది.. వాస్తవానికి వైయస్ జగన్ ఏదో ఆషామాసిగా ఈ ప్రకటన చేయలేదన్నారు కదా తెలుస్తోంది.
ప్రచారం లేదా హైప్ కోసం కూడా కాదని పోలింగ్ ముందే ఎగ్జిట్ పోల్స్ ఓటింగ్ సరళి ఓటర్ల నాడి తెలుసుకునేందుకు మూడు రకాల సర్వేలను సైతం చేశారట. ఐ ప్యాక్ మీడియా, సాక్షి మీడియా నిఘా వ్యవస్థకు కూడా అదనంగా మరో కొన్ని సంస్థలతో ఓటర్ల నాడి తెలుసుకునేందుకు పలు రకాల సర్వేలు చేశారు. అలా 175 నియోజకవర్గాలలో కూడా పెద్ద ఎత్తున సర్వేలు చేయించినట్లు తెలుస్తోంది. అందుకోసం ఒక ప్రత్యేకమైన యాప్ కూడా రూపొందించారు.. ఇందులో మహిళల ఓటింగ్ గ్రామంలో పెరిగిన ఓటింగ్ శాతంలో వైసిపి గెలిచే స్థానాలలో కూటమి గెలిచే స్థానాలపైన పూర్తిగా విశ్లేషించినట్లు సమాచారం. అందుకే అంత ధైర్యంగా జగన్ ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది.కానీ ఈ విషయం పైన అటు టిడిపి జనసేన నేతలు మాత్రం సరైన కౌంటర్లు వేయలేకపోతున్నారు.