అయితే చీప్ లిక్కర్ టాపిక్ గురించి ఏపీ సీఎం జగన్ను తాజాగా ప్రశ్నించారు. దీనికి సమాధానం ఆయన వ్యక్తిగత అభిప్రాయంతో స్పందించారు. మద్యం తాగుతారా అని అడిగితే ఎలా సమాధానం చెబుతారు అలా సమాధానం చెప్పారు. జగన్ మాట్లాడుతూ.. “నేను మద్యం తాగను. ప్రజలు కూడా మద్యం సేవించకూడదని నేను అనుకుంటున్నా. రాష్ట్రంలో లిక్కర్ కంట్రోల్ పాలసీకి కట్టుబడి ఉన్నా. ఎట్టి పరిస్థితులలో దాన్ని అమలు చేస్తా" అని జగన్ అన్నారు. అయితే ఇక్కడ చీప్ లిక్కర్ గురించి మాత్రం ఆయన మాట్లాడకపోవడం గమనార్హం.
2019లో జగన్ మద్యంపై నిషేధం విధిస్తానని రాష్ట్ర ప్రజలందరి ముందు ప్రామిస్ చేశారు. కానీ ఆ ఒక్క మాట నిలబెట్టుకోలేకపోయారు. చివరకు ఏపీ ప్రజల కోసం వైసీపీ ప్రభుత్వం కొత్త ఆల్కహాల్ బ్రాండ్లను రాష్ట్రంలోకి అనుమతించింది. మద్యం విక్రయాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తక్కువ ధరలకే నాణ్యమైన మద్యాన్ని తీసుకొస్తామని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ప్రజలు మద్యం సేవించడం తనకు ఇష్టం లేదంటూ జగన్ చీప్ లిక్కర్ అంశాన్ని తక్కువ చేసి మాట్లాడారు కానీ మందుబాబులు మాత్రం దీనిపై చాలా సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది.