దీంతో ప్రధానికి నరేంద్ర మోడీ మూడవ కేబినెట్లో మంత్రి పదవుల కోసం... ఇప్పటినుంచి నేతలందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ లిస్టులో ఆంధ్రప్రదేశ్ బిజెపి నేతలు ముందు వరుసలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమండ్రి నుంచి కచ్చితంగా గెలుస్తారని తెలుస్తోంది. దీంతో ఆమెకు కేబినెట్ పక్కా అని అంటున్నారు.
ఇక అటు అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన సీఎం రమేష్ కు కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా కేంద్ర మంత్రి పదవి వస్తుందని చెబుతున్నారు. ఈ ముగ్గురు నేతల్లో ఇద్దరికీ కేంద్ర మంత్రి పదవి వస్తుందని స్పష్టం చేస్తున్నాయి నేషనల్ మీడియా సంస్థలు.
అయితే మోడీ మూడవ కేబినెట్లో... తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీలకు ఛాన్స్ ఇవ్వబోరని తెలుస్తోంది. ఎందుకంటే బిజెపి నేతలు ముగ్గురు లైన్లో ఉన్నారు.. అటు తెలంగాణలో కూడా పోటీ ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో... తెలుగు రాష్ట్రాలకే ఎక్కువ మంత్రి పదవులు ఇస్తే... బాగుండదని బిజెపి అధిష్టానం భావిస్తోందట. అందుకే నరేంద్ర మోడీ కేబినెట్ విస్తరణలో... జనసేన మరియు తెలుగుదేశం పార్టీలకు చాన్స్ ఉండబోదని తెలుస్తోంది.