ఈ క్రమంలో తమదే గెలుపని పార్టీలు ధీమాతో ఉన్నాయి. కాగా, అందరి దృష్టి కూడా ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ పైనే ఉంది. ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? ఏ సర్వే సంస్థ ఏం చెబుతోంది? అధికారం ఎవరికి దక్కనుంది? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ రానే వచ్చేశాయి. ఇక సంస్థల వారిగా ఎగ్జిట్ పోల్స్ ఈ విధంగా ఉన్నాయి..2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను అంచనా వేసే ఎగ్జిట్ పోల్స్ ను సర్వే ఏజెన్సీలు ప్రకటించడం జరిగింది. లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అంచనాలను కూడా వెల్లడించాయి. కొన్ని ప్రముఖ సంస్థల సర్వేల అంచనాలు దాదాపుగా తెలుగు దేశం కూటమికి అనుకూలంగా ఉన్నాయి.
రైజ్ : టీడీపీ 113 - 122, వైసీపీ 48 - 60,
జనగళం : టీడీపీ 104 - 118, వైసిపీ 44-57,
చాణక్య స్ట్రాటజీస్ : టీడీపీ 114-125, వైసీపీ 39- 49
పయనీర్ : టీడీపీ 144, వైసీపీ 31
పీపుర్స్ పల్స్ : టీడీపీ 111-135, వైసీపీ 45-60
కేకే సర్వీస్ : టీడీపీ 161, వైసీపీ 14