ఆత్మసాక్షి సంస్థ మాత్రం రాష్ట్రంలో 17 స్థానాలతో వైసీపీకి విజయం దక్కనుందని చెబుతోంది. కూటమి మాత్రం రాష్ట్రంలో కేవలం 8 స్థానాలలో అనుకూల ఫలితాలను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంది. ఆత్మసాక్షి సర్వే ఫలితాల లెక్కలు గతంలో మెజారిటీ సందర్భాల్లో నిజమయ్యాయి. రేస్ సంస్థ సైతం రాష్ట్రంలో వైసీపీ 19 స్థానాల్లో అనుకూల ఫలితాలను సొంతం చేసుకుంటుందని చెబుతోంది.
19 స్థానాల్లో విజయం సాధించడం సులువైన విషయం కాకపోయినా గతంలో 22 స్థానాల్లో విజయం సాధించిన వైసీపీకి ఇన్ని స్థానాల్లో విజయం సాధించడం మరీ కష్టమైతే కాదు. కూటమికి మాత్రం కేవలం 6 స్థానాల్లో అనుకూల ఫలితాలు వస్తాయని ఈ సర్వే పేర్కొంది. టైమ్స్ నవ్ సంస్థ లెక్కల ప్రకారం మాత్రం ఏపీలో వైసీపీ 14 స్థానాల్లో గెలవనుండగా కూటమికి 11 స్థానాల్లో విజయం దక్కనుంది.
ప్రముఖ సర్వేల సంస్థలు ఎంపీల లెక్క విషయంలో వైసీపీదే పైచేయి అని చెబుతున్నాయి. ఎక్కువ సంఖ్యలో ఎంపీ స్థానాలు వైసీపీకి ఫేవర్ గా ఉన్నాయంటే అసెంబ్లీ స్థానాల విషయంలో సైతం అదే జరగనుంది. వైసీపీ నెత్తిన పాలు పోసే విధంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. వైసీపీ నేతలకు ఫలితాలకు ముందే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో సంబరాలు మొదలయ్యాయి. ఈ ఫలితాలను చూస్తే వైసీపీ ఫ్యాన్స్ జోరును ఆపలేమని విశ్లేషకులు చెబుతున్నారు.