ఈ సంగతి పక్కన పెడితే అన్ని సర్వేల్లో కామన్ గా కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థుల విజయాలు కనిపించాయి. కుప్పంలో పోటీ చేసిన చంద్రబాబు, పిఠాపురంలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్, మంగళగిరిలో కాంటెస్ట్ చేసిన నారా లోకేష్, హిందూపురంలో మళ్లీ నిలుచున్న నందమూరి బాలకృష్ణ వీళ్ళందరూ కూడా భారీ మెజారిటీతో గెలవబోతున్నారని అన్నీ సర్వేలు తెలిపాయి. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గెలవలేదు. లోకేష్ కూడా అసెంబ్లీలో అడుగుపెట్టలేదు కానీ ఈసారి వాళ్లు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే అసెంబ్లీలో చంద్రబాబుకు అండగా పవన్ కళ్యాణ్, లోకేష్ నిలవనున్నారు. ఇక వీరికి నందమూరి బాలకృష్ణ కూడా తోడైతే శాసనసభ సమావేశాల్లో జగన్కు వీరందరూ చుక్కలు చూపించే అవకాశం ఉంది.
అన్ని విషయాల్లో క్వశ్చన్ చేస్తూ తమదైన శైలిలో వారు ఆయనను ఆడుకోవచ్చు. ఇంతకుముందు చంద్రబాబు ఒక్కడే అసెంబ్లీలో మాట్లాడాల్సి వచ్చేది. కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వ్యక్తులు ఎగబడటంతో చంద్రబాబు సైలెంట్ అయిపోవాల్సి వచ్చేది. అయితే ఇకపై ఆయన భయపడాల్సిన అవసరం ఉండదని అంటున్నారు. టీడీపీ కూటమి గొంతుకను బలంగా వినిపించవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడుతారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఎవరికీ భయపడరు. అసెంబ్లీలో కూడా అదే తల పొగరుతో గడగడలాడించే అవకాశం ఉంది. ఒకవేళ టీడీపీ గెలిస్తే వైసీపీ వాళ్ళు తోక ముడుచుకోవాల్సిందే అని చెప్పుకోవచ్చు. మరి జూన్ 4వ తేదీన ఎవరు గెలుస్తారో చూడాలి.