విషయం ఏమిటంటే వైసీపీ, టీడీపీ కూటమి మధ్య ఓట్లతేడా స్వల్పంగానే ఉంటుందని పేర్కొనడం ఇపుడు ఆయా నీలి నాయకులకు మింగుడుపడడం లేదు. కాగా మరో 48గంటల్లో ఓట్ల లెక్కింపు, అసలైన ఫలితాలు వెలువడనున్నాయనే విషయం అందరికీ విదితమే. ఈలోగా ప్రజల్లో ఎన్నికల ఫలితాలపై ఆయోమయం సృష్టించడం ద్వారా కొద్ది గంటలైనా కేడర్ను సంతోష పర్చవచ్చని కొన్ని నీలి, కూలి మీడియాలు ఆరాటపడుతున్నాయి. అయితే ఆ విషయం గ్రహించిన అధికార పార్టీ నాయకులకు మాత్రం రియాలిటీ ఏమిటో ఈపాటికే అర్ధం అయిపోయింది. దాంతో మనవాళ్ళు జగన్ ని ఒంటరివాడిని చేసే పనిలో పడ్డారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదేనండీ... ఫలితాలు వెలువడిన మరుక్షణం వారు పచ్చ తీర్ధం పుచ్చుకోనున్నారని గుసగుసలు వినబడుతున్నాయి.
అవును, ప్రజానాడి ప్రభుత్వానికి చాలా స్పష్టంగా వ్యతిరేకంగా ఉందన్న సమాచారం వైసీపీ అభ్యర్థులను ఇపుడు గందరగోళంలోకి నెడుతోంది. మళ్లీ అధికారంలోనికి వచ్చి తీరుతాం అని, తొమ్మిదో తేదీన విశాఖ వేదికగా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతాం అని స్వయంగా సీఎం జగన్మోహన్రెడ్డి ప్రకటిస్తున్నా.. వారిలో విశ్వాసం కలుగడం లేదు అనడానికి తాజా పరిణామాలే కారణం. ఇప్పుడు తీరా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూశాక వారిలో ఏ మూలనో ఉన్న చిగురాశలు కూడా చెదిరిపోయాయి.