తద్వారా తమ పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుతుందని ఆశిస్తున్నాను అని అన్నారు. ఇక ఇదిలా ఉంటే ఏపీలో జరిగిన అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికలలో వైఎస్ఆర్సిపి విజయం సాధిస్తుందని స్థానిక సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశాయి. ఇక అదే క్రమంలో కొన్ని జాతీయ పార్టీలు ఓటమి అధికారం లోకి వస్తుంది అని స్పష్టం చేయడం జరిగింది. ఈ రెండు సర్వేల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ పై గందరగోళ పరిస్థితి నెలకొంది. అందుకే ప్రతి ఓటు కీలకమని భావిస్తున్నారు ఇరు పార్టీల సభ్యులు.
ఇక ఈ తరుణంలోనే కౌంటింగ్ ఏజెంట్లను అప్రమత్తం చేస్తున్నారు. అయితే పార్టీ గలుపు పై కీలక నేతలు సహా అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ధీమాగా ఉన్నారు. తాము చేసిన సంక్షేమం పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొస్తుందని గట్టి నమ్మకంపై నించున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వైసిపి గెలవబోతుందని.. సంబరాలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు తెలియజేశారు. మరికొన్ని గంటల్లోనే ఎవరిది గెలుపు ఎవరిది ఓటమి అనే విషయాలు స్పష్టం కానున్నాయి. ఏపీలో నెలకొన్న ఉత్కంఠ మరికొన్ని గంటల్లో విముక్తి కానుంది. ఇక గలుపు ఎవరిదైనా కష్టాలు తప్పవు అంటూ కొందరు భావిస్తున్నారు. మరికొందరు మాత్రం తమ అభిమానం నాయకుడు గలవాలని కోరుకుంటున్నారు.