![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/kcr2c775f3e-41fb-4982-993f-597f5587cd64-415x250.jpg)
ఇక ఇందుకు అనుగుణంగానే గులాబీ దళపతి కేసీఆర్ పార్టీ అభ్యర్థుల తరఫున ముమ్మర ప్రచార నిర్వహించారు. కానీ అనుకున్నది ఒక్కటి అయినది ఒకటి అనే విధంగా మారిపోయింది ప్రస్తుత పరిస్థితి. పార్లమెంట్ ఎలక్షన్స్ లో మరింత పరువు పోగొట్టుకుంది కారు పార్టీ. ఎందుకంటే కనీసం సిట్టింగ్ స్థానాలను కూడా కాపాడుకోలేక దారుణమైన ఓటములను చూస్తుంది. అయితే ఖమ్మంలో రామసహాయం రఘురామిరెడ్డి చేతిలో లక్షల ఓట్ల మెజారిటీతో బిఆర్ఎస్ సీటింగ్ ఎంపీ ఓడిపోయేలాగే కనిపిస్తుంది ఏకంగా ఇప్పటికే రఘురాం రెడ్డి 2.16 లక్షల ఓట్ల ఆదిక్యంలో ఉన్నారు. అక్కడ వార్ వన్ సైడ్ అయిపోయింది. కేవలం ఈ ఒక్కచోట మాత్రమే కాదు ఇక రాష్ట్రంలోనే చాలా చోట్ల బిఆర్ఎస్ సీటింగ్ స్థానాలను కూడా కాపాడుకోలేక పోతుంది. కనీసం ఒక్క స్థానంలో అయినా విజయం సాధిస్తుందా లేదా అనే విషయంపై అనుమానాలు నెలకొన్నాయ్. దీంతో ఇది కారు పార్టీ పతనమే అనే అభిప్రాయపడుతున్నారు ఎంతో మంది విశ్లేషకులు.