కానీ ఎన్నికల ఫలితాలు చూసి ఒక్కసారిగా అందరూ కంగు తింటున్నారు. కనీసం జనసేన పార్టీ సాధించిన అన్ని సీట్లు కూడా దక్కించుకుంటాయో లేవో అనే పరిస్థితి కూడా కనిపిస్తోంది. దీంతో అటు పార్టీ శ్రేణులు నేతలు తీవ్ర నిరాశలో ఉన్నట్లుగా కనిపిస్తోంది.. ఇదే సమయంలో పలువురు మంత్రులు సైతం ఓటమి బాటలో పయనిస్తూ ఉన్నారు. అయితే చివరి రౌండులో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప వైసిపి నేతలు గెలిచే అవకాశం అయితే ఎక్కడా కనిపించడం లేదని కూడా చెప్పవచ్చు..
అలాంటి వారిలో బొత్స సత్యనారాయణ, ఉషాశ్రీ చరణ్, రాజన్న దొర, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్, దాడిశెట్టి రాజా, అంబాటి రాంబాబు ,విడుదల రజిని, జోగి రమేష్ తో సహా పలువురు కీలకమైన నేతలు కూడా ఓటమి బాటలు పట్టేలా కనిపిస్తున్నారు. ఇక ప్రస్తుతం టిడిపి 129 .. వైసిపి 19.. జనసేన 20 బిజెపి ఏడు స్థానాలలో లీడ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే టిడిపి ఒక్కటి విన్నింగ్ సీట్ కొట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో టీడీపీ నేతలు ప్రస్తుతం సంబరాలు చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇంతటి స్థాయిలో పడిపోతుందని కేవలం కేకే సర్వే నే వైసీపీ పార్టీకి తెలియజేసింది.