ముఖ్యంగా గుండెల విసేలా బాధపడుతూ.. ఆ బాధను బయటకు చెప్పుకోకుండా కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చే వాళ్ళకి కూడా శుభాకాంక్షలు చెబుతూ తన గొప్ప మనసును మరోసారి నిరూపించుకున్నారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. అటు మహిళలకు , ఇటు విద్యార్థులకు, యువతకు ప్రతి ఒక్కరికి కూడా తన వంతు సహాయాన్ని అందించారు.. ఆర్థిక సహాయం అందించడమే కాదు విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు కూడా ఇంగ్లీష్ మాట్లాడే విధంగా ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ విధానాన్ని ప్రవేశపెట్టారు. పాఠశాలలకు విద్యార్థులను పంపించే విధంగా ప్రోత్సహిస్తూ అమ్మ ఒడి పథకం పేరిట అటుతల్లలకు కూడా సహాయము చేశారు.
అటు ఆటో డ్రైవర్లకు ఇటు మత్స్యకారులకు ఒకరికి ఏమిటి ప్రతి ఒక్కరికి అన్ని సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇంటికి సుమారుగా రూ.45 వేలకు పైగా సంవత్సరానికి ఆర్థిక సహాయం చేసిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఏమాత్రం గుర్తుపెట్టుకో లేకపోవడం ఇంతకంటే విషాదకరం మరెక్కడ లేదేమో.. కనీసం డిపాజిట్లు కూడా దక్కనంతగా ఘోరంగా ఓడించడం నిజంగా బాధాకరమని చెప్పవచ్చు.