ఉప్పాల రాంప్రసాద్ 2014లో కైకలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ 10 ఏళ్లకు ఆయనకు వైసీపీ నుంచి తన సొంత నియోజకవర్గం పెడనలో పోటీ చేసే అవకాశం దక్కింది. ఇద్దరూ బీసీలలో బలమైన గౌడ సామాజిక వర్గానికి చెందినవారు కావటం .. నియోజకవర్గంలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గం.. జనసేన , పవన్ అభిమానులు ఓటింగ్ టీడీపీకి బాగా కలిసి రావడంతో.. ఇక్కడ ముందు నుంచి తెలుగుదేశం కచ్చితంగా గెలుస్తుంది అన్న అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు గత ఎన్నికలలో కాగిత కృష్ణ ప్రసాద్ ఓడిపోవడం.. సానుభూతి కూడా ఆయనకు కలిసి వచ్చింది.
ఇక తాజా ఎన్నికల్లో అంతిమ విజేతగా.. టీడీపీ అభ్యర్థి కాగిత వెంకట కృష్ణ ప్రసాద్ విజయం సాధించడంతో పాటు ఫస్ట్ టైం అసెంబ్లీలోకి ఎంట్రీ ఇస్తున్నారను. కాగితకు ఏకంగా 37620 ఓట్ల భారీ మెజార్టీ వచ్చింది. మొత్తానికి కాగిత వెంకట్రావుకు వారసుడు కృష్ణ ప్రసాద్ ఇచ్చిన ఘనమైన నివాళిగా ఈ విజయాన్ని చెప్పాలి.