అయితే ఈసారి రాజకీయాలకు స్వస్తి పలికిన పేర్ని నాని.. తన వారసుడుగా పేర్ని కిట్టును రంగంలోకి దింపారు. వైసీపీ నుంచి పేర్ని కిట్టు తెలుగుదేశం నుంచి కొల్లు రవీంద్ర పోటీ పడ్డారు. బందరు నియోజకవర్గంలో బందరు కార్పొరేషన్ తో పాటు.. బందరు మండలాలు విస్తరించి ఉన్నాయి. వాస్తవానికి ఎన్నికలకు ఏడాది ముందు నుంచి బందరులో ఈసారి తెలుగుదేశం పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. పేర్ని నాని భారీ మెజార్టీతో ఓడిపోబోతున్నారంటూ అన్ని సర్వేలు చెప్పకనే చెప్పాయి. కృష్నా జిల్లాలో జనసేన + టీడీపీ కూటమి చాలా ప్రభావంగా చూపించిన నియోజక వర్గాల్లలో బందరు కూడా ఉంది.
అయితే చివర్లో సీటు దక్కించుకున్న పేర్ని కిట్టు గట్టి పోటీ ఇచ్చారన్న ప్రచారం జరిగింది. ఇక ఈ రోజు జరిగిన కౌంటింగ్లో బందరు గడ్డ నా అడ్డా అని కొల్లు రవీంద్ర ఫ్రూవ్ చేసుకున్నారు. ఏకంగా బందరు చరిత్రలోనే రికార్డు బ్రేక్ చేస్తూ 50242 ఓట్ల మెజార్టీతో సంచలన విజయం సాధించారు. ఈ విజయం తో పేర్ని నాని వారసుడికి పెద్ద దెబ్బే తగిలినట్ల య్యింది.