తాజాగా ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మొదటి మాట అక్కచెల్లెమ్మల గురించి.. ఆయన మాట్లాడుతూ.. అమ్మ ఒడి అందుకున్న అక్కాచెల్లెళ్లు ఓట్లు ఏమయ్యాయో తెలీదు.. అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియదు.. మొత్తం 53 లక్షల మంది మహిళలకు అమ్మ ఒడి వేశాను... ఫలితాలు చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది.. ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు.. ఇలాంటి ఫలితాలు వస్తాయని నేను ఊహించలేదు.. మహిళలకు సంక్షేమ పథకాలు అందించాము.. వారి ఓట్లు ఏమయ్యాయో తెలియదు.. మొత్తం కోటి 5 లక్షల మందికి సంక్షేమ పథకాలు అందించాము.. అవ్వ తాతలు చూపిన ఆప్యాయత ఏమైందో తెలియదు.. చేయూత అందుకున్న అక్క చెల్లెమ్మల ఆప్యాయత ఏమైందో తెలియదు..
ఆటో డ్రైవర్లు టాక్సీ డ్రైవర్లు మత్స్యకారులు ఇలా నా సోదరులంతా ఏమయ్యారో తెలియదు.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతోమందికి , ఎన్నో కుటుంబాలకు ఆర్థిక సహాయంతో పాటు సంక్షేమ పథకాల లబ్ధి అందించేలా చేశాను.. వీరంతా ఏమయ్యారో తెలియదు... అసలు ఉన్నారా ఉండి.. పట్టనట్టు వ్యవహరించారా? అన్నది అర్థం కావడం లేదు... అంటూ బాధను దిగమింగుకుంటూ దుఃఖాన్ని బయటకు కనిపించకుండా జాగ్రత్త పడుతూ ప్రెస్ మీట్ లో ఆయన పాల్గొనడం చూసి చాలామంది వైసిపి శ్రేణులు రోదిస్తున్నారు.