ఇక్కడ బొలిశెట్టి బ్రదర్స్ ఇద్దరూ కూడా గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పటి నుంచి జనసేన వాయిస్ చాలా అంటే చాలా బలంగా వినిపిస్తూ వచ్చారు. నియోజకవర్గంలో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీతో పాటు.. తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో ముందు నుంచి కాపు సామాజిక వర్గ ప్రాబల్యం బాగా ఎక్కువ. గత కొన్ని దశాబ్దాల నుంచి ఏ పార్టీ తరపున అయినా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మొత్తం మీద 2009లో ప్రజారాజ్యం పార్టీ గెలిచిన ఏకైక నియోజకవర్గం తాడేపల్లిగూడెం కావటం విశేషం. ఎన్నికల హడావుడి ప్రారంభమైనప్పటి నుంచి పోలింగ్ ప్రచార సరళి.. పోలింగ్ తర్వాత జనసేన నూటికి నూరు శాతం గెలిచే సీట్లలో ఒకటిగా తాడేపల్లిగూడెం నిలవబోతుందన్న అంచనాలు ముందే వినిపించాయి. చాలా సర్వేలలో సైతం చివరికి వైసీపీ సానుకూల సర్వేలలో కూడా ఇదే విషయం క్లియర్ గా స్పష్టం అయింది. ఇక ఈ రోజు కౌంటింగ్ లో జనసేన బొలిశెట్టి ఏకంగా 62492 ఓట్ల బంపర్ మెజార్టీతో ఘన విజయం సాధించారు.