ఏపీలో వైసీపీ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. అయితే.. ఈ ఓటమికి కారణాలు, భవిష్యత్తుపై రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్పందించారు. ఈ మేరకు ఇవాళ రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ... ధనంజయ రెడ్డి లాంటి చెత్త అధికారి వల్లే వైసీపీ ఓడిందని ఫైర్‌ అయ్యారు. చిన్ననాటి నుంచి రాజకీయాలను చాలా దగ్గరగా చూశానన్నారు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. రాజకీయాలు కింద పడటం .. లేవడం చాలా సార్లు చూసామని వివరించారు.

కానీ నేను చేసిన తప్పేంటో నన్ను ఎందుకు ఓడించారో తెలియడం లేదని పేర్కొన్నారు రాజానగరం మాజీ ఎమ్మెల్యే  జక్కంపూడి  రాజా. రాజకీయాల్లో చూడాల్సింది ఇంకా చాలా ఉంది అని అనిపిస్తోంది. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే నైజం చంద్రబాబుది కాదని... రాజకీయాలలో విలువలు పాటించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు రాజానగరం మాజీ ఎమ్మెల్యే  జక్కంపూడి  రాజా. లక్షల కోట్లు ప్రజా సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందని చెప్పారు.

మారల్సింది మా మైండ్ సెట్ అని అనుకుంటున్నానని... ఏరోజు నా భార్యతో గాని నా పిల్లలతో గాని పది నిమిషాలు కూర్చున్న పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు రాజానగరం మాజీ ఎమ్మెల్యే  జక్కంపూడి  రాజా. మా నియోజకవర్గంలోని గ్రామాలలో అభివృద్ధిపై చర్చకు నేను సిద్ధమని సవాల్‌ చేశారు. గతంలో కంటే నా హయాంలో 20, 30 రెట్లు ఎక్కువ అభివృద్ధి చేశాను....మా కాళ్లకు వ్యాధి ఉన్నా ..నడవలేని స్థితిలో ఉన్నా ... ప్రతి గడపగడపకు కాలినడకన తిరిగాను అని వెల్లడించారు రాజానగరం మాజీ ఎమ్మెల్యే  జక్కంపూడి  రాజా.

ప్రజలే జీవితం అనుకుని భ్రమలో ఇప్పటిదాకా బతికాను....నన్ను కన్న తల్లికి అమ్మమ్మకి ఒంట్లో బాగో లేకపోయినా వారి దగ్గర ఉండలేకపోయానని వెల్లడించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును మనస్పూర్తిగా తీసుకోలేకపోతున్నానని పేర్కొన్నారు. ధనంజయ రెడ్డి లాంటి చెత్త అధికారిని పెట్టుకోవడం వల్ల ఎమ్మెల్యేలు చాలా ఇబ్బంది పడ్డారని ఆరోపణలు చేశారు. ధనంజయ రెడ్డి ఎమ్మెల్యేలను రేపు .. ఎల్లుండి అంటూ ఐదు సంవత్సరాల తరబడి తెప్పించుకున్నారని ఆగ్రహించారు. ధనుంజయ రెడ్డిని ముఖ్యమంత్రి గుడ్డి విశ్వాసంతో నమ్మారు.‌...ప్రజలకు సేవ చేయడం కోసం ధనుంజయ రెడ్డి కాళ్ల చుట్టూ తిరిగేవాళ్లమన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: