ఎన్నికల సమయంలో చంద్రబాబు చాలా హామీలు ఇచ్చారు. దానికి తగ్గట్టే గతంలో ఎన్నడూ లేని రీతిలో మెజార్టీ వచ్చింది. దీంతో హామీల అమలుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానమైన వాటిలో వాలంటీర్ల వ్యవస్థ కూడా ఉంది. గతంలో 50 ఇళ్లకు ఒకరు చొప్పున వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం నియమించింది. వారికి కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చే వారు. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో వాలంటీర్లకు రూ.10 వేల చొప్పున టీడీపీ కూటమి ప్రభుత్వం ఇవ్వాలని భావిస్తోంది. అంతేకాకుండా గ్రామానికి ఐదుగురు వాలంటీర్లను నియమించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే త్వరలోనే నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం. అంతేకాకుండా దీనికి సంబంధించి ప్రస్తుతం విధివిధానాల రూపకల్పన జరుగుతోంది. అంతేకాకుండా దీనికి కొన్ని నిబంధనలను విధించనున్నారు. వాలంటీర్లంతా డిగ్రీ ఉత్తీర్ణత చెంది ఉండాలి.
ఎన్నికల సమయంలో చంద్రబాబు చాలా హామీలు ఇచ్చారు. దానికి తగ్గట్టే గతంలో ఎన్నడూ లేని రీతిలో మెజార్టీ వచ్చింది. దీంతో హామీల అమలుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానమైన వాటిలో వాలంటీర్ల వ్యవస్థ కూడా ఉంది. గతంలో 50 ఇళ్లకు ఒకరు చొప్పున వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం నియమించింది. వారికి కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చే వారు. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో వాలంటీర్లకు రూ.10 వేల చొప్పున టీడీపీ కూటమి ప్రభుత్వం ఇవ్వాలని భావిస్తోంది. అంతేకాకుండా గ్రామానికి ఐదుగురు వాలంటీర్లను నియమించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే త్వరలోనే నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం. అంతేకాకుండా దీనికి సంబంధించి ప్రస్తుతం విధివిధానాల రూపకల్పన జరుగుతోంది. అంతేకాకుండా దీనికి కొన్ని నిబంధనలను విధించనున్నారు. వాలంటీర్లంతా డిగ్రీ ఉత్తీర్ణత చెంది ఉండాలి.