ఈ ఫిలిం సిటీలో సినిమా దృశ్యాలకు కావలసిన రకరకాల ఫిక్స్డ్ సెట్స్ అనేకం ఉంటాయి. ఇక ఉద్యానవనాలకైతే లెక్కేలేదు. ఇక్కడికి వెళ్లి మొత్తం తిరిగి చూడాలంటే పర్యాటకులకు కనీసం వారం రోజులైనా పడుతుంది. ప్రపంచంలోనే లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్సిటీ ఇన్ ది వరల్డ్గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం పొందిన ఈ ఫిల్మ్సిటీలో హాలీవుడ్ చిత్రాలు సైతం షూటింగ్ జరుపుకుంటాయి అంటే మీరు అర్ధం చేసుకోండి. ఇక్కడికి రాని ఇండియన్ సినీ ప్రముఖులు లేరు. ఏడాదికి సగటున 13 లక్షల మంది పర్యాటకులు ఫిల్మ్ సిటీని సందర్శిస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి. ఉర్దూ నుంచి కన్నడం వరకు, గుజరాతీ నుంచి బంగ్లా వరకు ఎన్నో ప్రాంతీయ భాషల్లో టెలివిజన్ ఛానళ్లను తెలుగు నేలపై ఆవిష్కరించడం ఒక్క రామోజీరావుకు మాత్రమే చెల్లింది.
ఈ ఫిల్మ్ సిటీతో పాటు "ఉషాకిరణ్ మూవీస్" అనే ప్రొడక్షన్ హౌస్ను రామోజీరావు స్థాపించి అనేక సినిమాలను చిత్రీకరించారు. అందులో దాదాపుగా అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఈ ఫిల్మ్ సిటీలో దాదాపు 2500కు పైగా సినిమాల చిత్రీకరణ జరిగినట్లు సమాచారం. ఇక్కడ చిత్రీకరించి ప్రపంచంలోనే అత్యధికంగా ప్రాచుర్యం పొందిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అందులో చెన్నై ఎక్స్ప్రెస్, క్రిష్, బాహుబలి మరియు డర్టీ పిక్చర్ ఉన్నాయి. అంతేకాకుండా తెలుగులో అనేక సినిమాలు ఇక్కడ రూపొంది బ్లాక్ బస్టర్ గా నిలిచినవీ ఉన్నాయి.