కడప అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఆ తరువాత వైసిపి పార్టీ అధిష్టానాన్ని కొనసాగిస్తూ వచ్చింది కానీ ఇప్పుడు మొదటిసారి మహిళ అభ్యర్థి ఇక్కడ గెలిచి ఒక చరిత్రను సైతం సృష్టించారు. టిడిపి అభ్యర్థి బల్లిలో నిలిచిన రెడ్డప్ప గారి మాధవి రెడ్డి ఏకంగా 18 వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచింది. ఇప్పటివరకు అన్ని పార్టీలు ఈ సీటు మైనార్టీలకు ఎక్కువగా కేటాయించాయి. కేవలం అప్పుడప్పుడు టిడిపి పార్టీ మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్టు ఇస్తూ వస్తూ ఉండేది కానీ అక్కడ గెలుపు మాత్రం వచ్చేది కాదట.
కానీ ఈసారి టిడిపి రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వడంతో పాటు మహిళా సీట్ కేటాయించడంతో పూర్తిగా అక్కడ రాజకీయాలు మారిపోయాయి.. దాదాపుగా 70000 పై చీలుకు మైనార్టీ ఓట్లు ఉన్నప్పటికీ 35 ఏళ్లుగా మైనారిటీలదే అక్కడ ఆధిపత్యం.. ఇప్పుడు ఏకంగా అలాంటి వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా మాధవి రెడ్డి వైపు నిలిచారు మైనార్టీలు ఇలా కడప నియోజవర్గంలోనే ఒక చరిత్రలో మిగిలిన మహిళగా మాధవి రెడ్డి పేరు సంపాదించింది. ప్రస్తుతం ఈ విషయం రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతున్నది.