ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ దాదాపుగా 3వేల ఓట్ల మెజారిటీతో అక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థి అయిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పైన గెలిచారు. కేతిరెడ్డి వెంకట్రాంరెడ్డి 20 సంవత్సరాల నుంచి ధర్మారంలో పనిచేస్తూ ఉన్నారు. 2005లో కాంగ్రెస్ ఇంచార్జిగా ఎంట్రీ ఇచ్చిన ఈయన 2009 ఎన్నికలలో పోటీ చేసి గెలిచారు.. ఆ తర్వాత 2014లో ఓడిపోయారు. 2019లో మళ్లీ గెలిచారు ఇప్పుడు మళ్లీ ఓడిపోయారు. ఎన్నికలకు నెల ముందు నియోజకవర్గంలో అడుగుపెట్టి అక్కడ గెలిచిన సత్య కుమార్ ఒక సంచలనంగా మారారు.
ముఖ్యంగా సత్య కుమార్ కూడా ఎవరో ధర్మవరం ప్రజలకి అసలు తెలియదు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడని విషయం పైన ఎవరికీ తెలియదు.. అసలు ఆయన కులం పేరును కూడా ఊరికే పెట్టుకున్నారని యాదవ్ కాదని అభిప్రాయాలు కూడా ఎక్కువగా వినిపించాయి. అంతేకాకుండా కేతిరెడ్డి గత ఐదేళ్లలో గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ పలు రకాలు నియోజకవర్గం తిరిగి ప్రతి ఇంటిని కూడా పలకరించారు. కరోనా రెండేళ్లను మినహాయిస్తే మూడు సంవత్సరాల కేతిరెడ్డి నియోజకవర్గంలో డోర్ టు డోర్ తమ సమస్యలను విని చాలా వాటిని పరిష్కరించారు. ఇలా ఎన్నో చేసినప్పటికీ నాయకుడు చివరికి ఈసారి ఎక్కువ పేరు లేనటువంటి నాయకుడు చేతిలో ఓడిపోవడంతో రాయలసీమలో ఈ సీటు పైన మరొక సారి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.