ఇప్పుడు అలాగే సాక్షి టీవీ ని , టివి -9, ఎన్టీవీ ను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆపేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కేబుల్ ఆపరేటర్లు ఎవరు అధికారంలోకి వస్తే.. అటు ఆ చానల్ ను ఇటు ఈ చానల్ను సైతం నిలిపివేచే స్థితికి జారిపోయారు. వీటి ఇన్ఫాక్ట్ వల్ల రాష్ట్రంలో సాక్షి ఛానల్ రాదు. రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి ట్రాయికి ఫిర్యాదు చేశారు. ఇక్కడ ఒక టెక్నికల్ పాయింట్ ఏమిటంటే.. ట్రాయి రూల్స్ ప్రకారం ఒక ఛానల్ కావాలని ప్రతి కేబుల్ ఆపరేటర్ని 20% వరకు అడగాలి..
సాధారణంగా ఏమేం చానల్స్ కావాలని విషయం పైన ఒక లిస్టు ఇస్తే అందులో మనం టిక్ పెట్టిన వాటికి ఇవ్వాలి.. వాస్తవానికి ఎవరూ కూడా ఆ లిస్టును అయితే చూడరు. డబ్బులు ఇస్తే కేబుల్ ఆపరేటర్ చూస్తారు కదా అని వదిలేస్తూ ఉంటాము. దాంట్లో వారు ఇచ్చేటువంటి చానల్స్ టిక్కు పెట్టేసుకొని ట్రాయికి చూపెడుతూ ఉంటారు. దీంతో ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు సాక్షి ఛానల్ మాకు కావాలి అంటూ 20% వరకు సంతకాలు పెట్టించి కేబుల్ ఆపరేటర్ చేత ట్రాయికి అందించారు. అయినా కూడా ఇవ్వక పోతే అప్పుడు కేసు పెట్టడం జరుగుతుంది. అప్పుడు కేబుల్ ఆపరేటర్ మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులలో సాక్షి ఛానల్ కావాలని అడుగుతారా అనే మిలియన్ డాలర్ల ప్రశ్న కూడా ఎదురవుతోంది. మరి టీవీ9, టీవీ5 పరిస్థితి ఏంటో చూడాలి.. ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువగా చాలామంది ఆన్లైన్ ద్వారానే చూస్తున్నారు.