అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఏమిటంటే జగన్కు రిటర్న్ గిఫ్ట్ అన్నటువంటిది.. ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష సమయంలో ఉన్నప్పుడు పలువురు సోషల్ మీడియా కార్యకర్తలు అలాగే పలువురు నాయకులు మీద కేసులు పెట్టడం వేధించడం వంటివి జరిగింది. ఇప్పుడు జగన్ టీం మీద కూడా అదే మీమ్స్, కేసులు పెట్టడం వంటివి జరుగుతోంది. ఇది రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు అనేటువంటిది వినిపిస్తున్నాయి.
రాజకీయంగా జగన్కు రిటర్న్ గిఫ్ట్, బాబుకి రిటర్న్ గిఫ్ట్ అనేటువంటి వాటిలో తప్పేమీ లేదు.. కానీ భౌతికంగా లేదా ప్రజాస్వామ్యంలో దాడులు ప్రతి దాడులు అనేది ఎవరు చేసిన కూడా తప్పే అని చెప్పవచ్చు. ఈ ఒక్క విషయంపైనే నేతలు కార్యకర్తలు సైతం ఎవరైనా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో టిడిపి పార్టీ గెలిచిన తర్వాత కూటమి నేతలు సైతం వైసీపీ నేతల మీద కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉన్నాయి. మరి ఇకమీదటైనా ఇలాంటి దాడులు జరగకుండా చూసుకుంటారేమో చూడాలి.