5 కోట్ల మంది ఆంధ్రులకు అమరావతి చిరునామా అని అన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు. తాజాగా ఆంధ్రప్రదేశ్ తాజా ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు అమరావతిలో పర్యటించి పరిశీలించారు. అనంతరం మీడియాతో ఆయనతో మాట్లాడటం జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గురించి, అమరావతి ఇంకా పోలవరం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఏపీలో ఏ అంటే అమరావతి అని అన్నారు.పీ అంటే పోలవరం అని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు. పోలవరం ప్రాజెక్ట్ ని కనుక పూర్తి చేస్తే.. రాయలసీమ ఖచ్చితంగా రతనాల సీమగా మారుతుంది. రైతులు ఏకంగా 1,631 రోజులు ఆందోళన చేశారు. అయితే గత ప్రభుత్వం ప్రజావేదిక కూల్చి పాలన ప్రారంభించింది. రాష్ట్రానికి వరంగా ఉండాల్సిన పోలవరం ఒక వ్యక్తి వల్ల తీరని శాపం లాగా మారింది. అమరావతి ఏ వ్యక్తికో.. ఒక సామాజిక వర్గానికో సంబంధించినది కాదని అన్నారు చంద్ర బాబు నాయుడు.


ఐదు సంవత్సరాలలో ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది. ఇక్కడున్న పైపులను, ఇసుకను, కంకర ఇంకా అలాగే రోడ్లు వేసే మెటల్ కూడా దొంగిలించుకుపోయారు.అమరావతిలో కనీసం ఒక్క బిల్డింగ్ కూడా ముట్టుకోలేదని చంద్ర బాబు నాయుడు తెలిపారు. ఓ పక్క హైకోర్టు ఇంకా అలాగే మరోపక్క సెక్రెటేరియట్ బిల్డింగ్ నిర్మించామని చంద్ర బాబు తెలిపారు. ఇవన్ని తిరిగిన తరువాత ఇక్కడ ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చంద్ర బాబు నాయుడు అన్నారు. రోడ్లు అన్ని కూడా ఐదు సంవత్సరాలు ఆగిపోయాయి. బిల్డింగ్ ల కట్టడాలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు వాటిని తిరిగి పున: ప్రారంభిస్తామని చంద్ర బాబు నాయుడు తెలిపారు. అమరావతికి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకు స్థాపన జరిగిందని చంద్ర బాబు నాయుడు తెలిపారు. ఆ బిల్డింగ్ లని వదిలేసాక వాటిల్లో ఎక్కువగా తుమ్మ చెట్లు మొలిచిపోయాయని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చంద్ర బాబు నాయుడు. ప్రస్తుతం చంద్ర బాబు నాయుడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: