*కొణిదల పవన్ కల్యాణ్ అనే నేను ఈ మాట కోసం ఎంతో కాలంగా ఫ్యాన్స్ ఎదురుచూపు
*ఎట్టకేలకు అసెంబ్లీ లో అడుగు పెట్టిన పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కూటమి తిరుగులేని విజయం సాధించింది.ఏకంగా 164 సీట్లు సాధించి సంచలన విజయాన్ని నమోదు చేసింది.కూటమిలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ 21 అసెంబ్లీ సీట్లు ,2 పార్లమెంట్ సీట్లు తీసుకోని అన్నిటిని కూడా గెలిపించుకొని 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించారు.దీనితో పవన్ పేరు దెస వ్యాప్తంగా మారు మ్రోగిపోయింది.గత ఎన్నికలలో తాను పోటీచేసిన భీమవరం ,గాజువాక రెండు నియోజక వర్గాలలో కూడా పవన్ కల్యాణ్ ఓటమి చెందారు.అయినా కూడా దిగులు చెందకుండా ఎంతో ఓర్పుతో నిలబడ్డారు.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల కూడదని బీజేపీ ,టీడీపీ లతో కూటమిగా ఏర్పడి పవన్ రాజకీయాలను ఓ మలుపు తిప్పారు.గత ఎన్నికలలో 151 సీట్లు సాధించి ఎంతో బలంగా వున్న వైసీపీ పార్టీతో పవన్ కల్యాణ్ గట్టిగా పోరాడారు.వారు వ్యక్తిగతంగ ఎంత ట్రోల్ చేసిన కూడా పవన్ తన పట్టును కోల్పోలేదు.చివరివరకు ఎంతో ధైర్యంగా నిలబడ్డారు.