![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/chandrababu634bc98a-c6c0-4dfd-9444-37ebddfc803d-415x250.jpg)
అయితే నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రజా సమస్యలపై ఎవరి తీరు ఎలా ఉండబోతుంది? ఎవరు ఎలా గళం విప్పబోతున్నారు అన్న విషయం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ప్రస్తుతం చంద్రబాబుకి అసెంబ్లీలో పూర్తిస్థాయి మెజారిటీ ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన దానికి కావలసిన దానికంటే ఎక్కువ సీట్లు టిడిపి గెలిచింది. అయినప్పటికీ జనసేన బీజేపీ పార్టీలతో ఉన్న పొత్తుకు న్యాయం చేస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు. కాగా ఇంత మెజారిటీ ఉన్నప్పటికీ అటు చంద్రబాబుకి అసెంబ్లీలో ఒక్క విషయం మాత్రం అటు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. అదే పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి.
సినిమా హీరోగా ఉన్నప్పుడు లగ్జరీ లైఫ్ ను వదులుకొని ప్రజలకు ఏదో చేయాలి అనే ఉద్దేశంతో పవన్ రాజకీయాల్లోకి వచ్చారు. ఇక ఎన్నిసార్లు ప్రజలు దెబ్బ కొట్టిన వాళ్ల తరపున పోరాడారు. ఏ పదవి లేకపోయినా ప్రజలకు సహాయం చేస్తూనే వచ్చారు. ఇలా ప్రజలకు సమస్య వచ్చిందంటే ఏం చేయడానికి అయినా సిద్ధమవుతూ ఉంటారు పవన్. ఇక ఇప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఏకంగా ప్రజాసమస్యలపై పోరాటం చేసే అవకాశం వచ్చింది.