![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/-pattabhiram540c6d01-cdae-4b2c-85c8-da684bc9133e-415x250.jpg)
*పార్టీ బలోపేతంలో పట్టాభి రామ్ కీలక పాత్ర
*మరి ఈ సారి నామినేటెడ్ పదవి దక్కేనా ..?
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి (NDA alliance) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీడీపీ -135 , జనసేన- 21, బీజేపీ - 8 సీట్లతో తిరుగులేని విజయం సాధించాయి..ఈ ఎన్నికల్లో వైసీపీ కేవలం11 సీట్లు సాధించి ఘోర ఓటమి చవిచూసింది. ఈ ఫలితాలతో వైసీపీకి కొమ్ముకాసిన అధికారుల్లో భయం మొదలైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయాలపై చేసిన దాడి ఇప్పటికి గుర్తుండే ఉంటుంది.కూటమి ప్రభుత్వం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న తెలుగు తమ్ముళ్లు వైసీపీకి కొమ్ముకాసిన నాయకులపై కొరడా జుళిపిస్తున్నారు.అయితే టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి అయిన కొమ్మ రెడ్డి పట్టాభి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.గత వైసీపీ ప్రభుత్వ అక్రమాలను తన వాగ్ధాటితో ఎంతగానో ప్రశ్నించారు.వైసీపీ పై ప్రశ్నల వర్షం కురిపిస్తూ టీడీపీ ఫైర్ బ్రాండ్ గా ఎదిగారు.