* మెగా డీఎస్సీ అంశమే వైసీపీకి శాపంగా మారిందా?
* నిరుద్యోగులను పట్టించుకోకపోవడమే వైసీపీ ఘోర ఓటమికి కారణమా..?
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి.. ఈ ఎన్నికలలో కూటమి ఏకంగా 164 సీట్లు సాధించి తిరుగులేని విజయం సాధించింది. వైసీపీ పార్టీ కేవలం 11 సీట్లు మాత్రమే సాధించి ప్రతిపక్ష హోదా కోల్పోయింది. కూటమిలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ 21 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ స్థానాలు పొందగా అన్నింట్లో విజయం సాధించి 100 శాతం స్ట్రైక్ రేటు పొందారు. కూటమి గెలుపులో జనసేన పార్టీ కీలక పాత్ర పోషించింది.. గతంలో రెండు చోట్ల ఓడిపోయినా పవన్ కల్యాణ్ ఇప్పుడు తనతో 20 మంది ఎమ్మెల్యే లను గెలిపించుకొని ఏకంగా రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా పదవి భాద్యతలు చేపట్టి రియల్ స్టార్ గా నిలిచారు. అయితే రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి దారుణంగా మారింది. ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో రాష్ట్రప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోలేని పరిస్థితి ఏర్పడింది. అయితే వైసీపీ ఇంత దారుణంగా ఓడటానికి కారణం రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యను పట్టించుకోకపోవడం.