చివరకు జగన్ కూడా మీడియా ముందుకు రారు.. సజ్జలే వచ్చేస్తారు.. ప్రభుత్వం .. జగన్ తరపున వకల్తా పుచ్చుకుని మాట్లాడేస్తూ ఉంటారు. ఇక రాజకీయ ప్రత్యర్థులు సైతం ఐదేళ్ల పాటు సజ్జలను సకల శాఖా మంత్రి అని వ్యగ్యంగా పిలుచుకున్నారు. అంటే అందరు మంత్రుల శాఖల్లోనూ సజ్జల కాళ్లు వేళ్లూ పెట్టేస్తూ వచ్చారు. ఏ మంత్రికి స్వేచ్ఛ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు జగన్ సజ్జల ప్రయార్టీ తగ్గిం చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది. సజ్జల తనకు రాంగ్ గైడెన్స్ ఇచ్చి తప్పుదేవ పట్టించారన్న ఆగ్రహం జగన్ వ్యక్తం చేసినట్టు టాక్ ?
ఇక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కూడా జగన్ సజ్జలకు పూర్తిగా ప్రయార్టీ తగ్గించేశారని.. అందుకే బయట ఎక్కువుగా పేర్ని నాని లేదా కొడాలి నాని లాంటి వారే కనిపిస్తున్నారని కూడా వైసీపీ వాళ్లే చర్చించు కుంటున్నారు . మరి జగన్ ప్రయార్టీ తగ్గిస్తే సజ్జల రూటు ఎలా మారుతుందన్న ప్రశ్నకు కాలమే ఆన్సర్ చేయాలి.