* పెద్దిరెడ్డి అడ్డా పుంగనూర్
* జగన్ కు అత్యంత సన్నిహితుడు
* ఓటమి తెలియని రాజకీయ నాయకులు
* కూటమి ఊపును కుదిపేసిన టైగర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక చరిత్ర ఉంటుంది. ఈ ప్రాంతంలో ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే... వరుసగా గెలుస్తూనే ఉంటారు. తమ నియోజకవర్గాన్ని గుప్పెట్లో పెట్టుకుంటారు. అలా చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో... మాజీ మంత్రి వైసిపి నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరు. వైసిపి పార్టీలో కీలక నేతగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.... ఇప్పటివరకు వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
తన నియోజకవర్గాన్ని... గత 25 సంవత్సరాలుగా... తన చేతిలో పెట్టుకొని రాయలసీమ ముద్దుబిడ్డగా... ఎదిగారు పెద్దిరెడ్డి. ఇక ఇప్పుడు.... కష్టకాలంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి అండగా పెద్దిరెడ్డి ఉంటున్నారు. మళ్లీ వైసిపి అధికారంలోకి వచ్చే దిశగా... ఏం చేయాలో తన వంతు తాను చేస్తున్నారు. ఏజ్ పైబడినప్పటికీ కూడా.... ప్రజల కోసమే పనిచేస్తున్నారు. అయితే... పుంగనూరులో... పెద్దిరెడ్డి పైన వ్యతిరేకత ఉన్నప్పటికీ... ఆయన ఓడిపోయేంత మాత్రం లేదు. నిత్యం ప్రజల్లో ఉంటున్నాడు కాబట్టి ఆయనను... మొన్న కూడా గెలిపించుకున్నారు పుంగనూరు ప్రజలు.