*ప్రత్యక్ష రాజకీయాలలో తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జగన్ పేరు సంచలనం అని చెప్పాలి.దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా 2009 లో ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగు పెట్టిన జగన్ కడప ఎంపీగా పోటీ చేసి సంచలన విజయం సాధించాడు.అదే ఎన్నికలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండో సారి ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు.కానీ అనూహ్యంగా అదే సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాదంలో మరణించడంతో రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పు సంభవించింది.అభిమానులు ,కార్యకర్తలు జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకోగా అప్పటి కేంద్రం లో వున్నా కాంగ్రెస్ పార్టీ కోనిజేటి రోశయ్యను ముఖ్యమంత్రిని చేసింది.అదే సమయంలో కెసిఆర్ తెలంగాణ ఉద్యమం ఉదృతం చేయగా ఆ ఒత్తిడిని నిలువరించలేక రోశయ్య సీఎం పదవికి రాజీనామా చేసారు.ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ శాసన సభ స్పీకర్ అయినా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ని సీఎంని చేసింది.అదే సమయంలో జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రకు కూడా కాంగ్రెస్ అనుమతించకపోవడంతో జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసారు.