అదృష్టం అనేది అన్ని వేళలా మనకి కలిసి రాదు.కాబట్టి ఖచ్చితంగా కష్టపడాలి. అంతే కానీ నేను కష్టపడను. ఇంట్లోనే కూర్చుంటాను.. జనాలు ఓట్లేస్తే మళ్లీ అధికారంలోకి వస్తాను. లేదంటే రాను అనే మిట్ట వేదాంతం వల్లిస్తే, జగన్ ఎప్పటికీ కూడా మరోసారి సిఎమ్ మాత్రం కాలేరు.తొలి సారి జగన్ సిఎమ్ అయ్యింది మాత్రం నవరత్నాల హామీ ఇచ్చి. జనాల్లోకి నేరుగా వెళ్లి జనాలను పలకరించి మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ జనాలకు జగన్ పాలన బాలేదని జగన్ కు పాలన రాదని గత 5 ఏళ్లలో అర్ధం అయ్యింది.అసలు నిజంగా జనాలకు అలాగే అర్ధం అయిందా..లేక జనాలకు అలా చేరవేసారా.. అన్నది వేరే సంగతి. జనాల్ని మళ్లీ తన దారికి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా జగన్ కు వుంది. రాజకీయాలు చేస్తాను. అధికారం కావాలి అనుకుంటే కుదరదు. ఒకసారి సిఎమ్ అయ్యా ఇక ఈ జన్మకు అది చాలు అనుకుంటే అది వేరే సంగతి. అదేదో క్లారిటీగా చెప్పేస్తే పార్టీని నమ్ముకున్నవారంతా కూడా ఇక ఎవరి దారి వారు చూసుకుంటారు.


అంతే తప్ప మళ్ళీ చంద్రబాబు ఫెయిల్ అయ్యినప్పుడు  జనం మళ్లీ తన దగ్గరకే వస్తారు. అప్పటి వరకు  సైలంట్ గా వుందాం అనుకుంటే రాజకీయం చేయడం రాదు అనుకోవాలి. అయిదేళ్లలో కనీసం ఒక్కసారి కూడా మీడియాను ఫేస్ చేయలేదు. తన మనసులో మాటని బయటకి చెప్పింది లేదు.. అధికారంలోకి వున్నపుడు అంతా నడిచిపోయింది. కానీ ఇప్పుడు ఆ అధికారం లేదు.తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా జగన్ పాలనను అసలు వదిలిపెట్టడం లేదు. ఆర్థిక అవినీతి, పోలవరంలో అసమర్ధత ఇలా ఒక్కొటీ కూడా బయటకు తీస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా దుకాణం కట్టేసింది. కానీ జనసేన, టీడీపీ సోషల్ మీడియా అకౌంట్స్ మాత్రం రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాయి. పొరపాటున ఎవరైనా వైసీపీ సానుభూతి పరుడు ఓ పోస్ట్ పెడితే అందరూ ఓ రేంజ్ లో విరుచుకుపడి పోతున్నారు. కనీసం మద్దతు ఇచ్చే వారే లేరు. కాబట్టి జగన్ బయటకి రావాలి. ఖచ్చితంగా కష్టపడాలి. అప్పుడే సీఎం అవుతాడు.. లేదా రాజకీయాల్లో ఎండ్ అవుతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: