![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_analysis/jaganc14d9f35-2402-45a9-a542-174c65038698-415x250.jpg)
చాలా తప్పుల కారణంగా వైసిపి పార్టీ... కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. 175 స్థానాలకు 175 కొడతానని... ప్రసంగాలు ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి.... చివరికి ప్రతిపక్ష స్థానాన్ని కూడా సంపాదించుకోలేకపోతున్నాడు. అయితే ఇలాంటి నేపథ్యంలో... వైసిపి పార్టీ ఓటమికి మరో కారణం కూడా ఉందని తాజాగా తేలిపోయింది. అదేంటంటే.. ఏపీలో రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోవడం. ఏపీలో మూడు రాజధానుల... అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో... రియల్ ఎస్టేట్ ఢమాల్ మంది.
ముఖ్యంగా గుంటూరు, కృష్ణ, పశ్చిమగోదావరి, విజయవాడ లాంటి ప్రాంతాలలో... భూముల ధరలు అమామంతం పడిపోయాయి. సామాన్యుడు కూడా కొనుగోలు చేసే స్థాయికి... ఏపీ భూముల ధరలు పడిపోయాయి. దీంతో... రియల్ ఎస్టేట్ ద్వారా సంపాదించాలనుకున్న చాలామంది... తీవ్రంగా నష్టపోయారు. 5 లక్షలు పెట్టి ల్యాండ్ కొంటే పది లక్షలు రావాలని.. ఎవరైనా అనుకుంటారు.
కానీ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత... ఏపీలో ఆ పరిస్థితి కనిపించలేదు. రియల్ ఎస్టేట్ పడిపోవడంతో... జనాలు ఎవరు కూడా భూములు కొనుగోలు చేసేందుకు... ఆసక్తి చూపించలేదు. ఇక.. దాని ఫలితంగా...గుంటూరు, కృష్ణ, పశ్చిమగోదావరి, విజయవాడ లాంటి ప్రాంతాలలో గెలవాల్సిన సీట్లను కూడా కోల్పోయింది. 2019 ఎన్నికల్లో... ఇక్కడ దాదాపు క్లీన్ స్వీప్ చేసిన వైసిపి...మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. ఇలా జగన్మోహన్ రెడ్డికి రియల్ దెబ్బ తగిలింది. దీంతో ఏపీలో వైసీపీ పార్టీ 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చిందని అంటున్నారు.