*ఎన్టీఆర్ అసలైన రాజకీయ వారసుడిగా ఎదిగిన హరికృష్ణ
*ఆ ముక్కుసూటి తనమే హరికృష్ణని రాజకీయాలకు దూరం చేసిందా ?
ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం ఏర్పాటు రాజకీయంగా సంచలనం సృష్టించింది.పార్టీని ఏర్పాటు చేసిన 9 నెలలలోనే అధికారంలోకి వచ్చిన ఘనత ఏ పార్టీకి కూడా లేదు. తెలుగు వాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు.అనంతరం చైతన్య రథం ద్వారా రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించారు.9 నెలల పాటు ఎన్టీఆర్ ప్రజలతోనే మమేకం అయ్యారు.ఆ సమయంలో ఎన్టీఆర్ తన ఇంటికంటే ఎక్కువగా చైతన్య రధంలోనే గడిపారు.ఆ చైతన్య రధసారధి హరికృష్ణ .చైతన్య రధ సారధిగానే కాకుండా పార్టీ పనుల్లో కూడా హరికృష్ణ చురుకుగా పాల్గొనేవారు.దీనితో హరికృష్ణ పార్టీ నేతలకు సుపరిచితుడిగా మారారు.పార్టీ అధికారంలోకి రావడానికి హరికృష్ణ ఎంతో క్రియాశీలంగా వ్యవహరించారు.పార్టీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ వున్నా కూడా హరికృష్ణ ఏ నాడు తండ్రి మాట జవదాటలేదు.ఎన్టీఆర్ ఉన్నంత కాలం హరికృష్ణ సామాన్య కార్యకర్తగానే పని చేసారు.హరికృష్ణ పార్టీలోని కార్యకర్తలందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు.అప్పట్లో ఎన్టీఆర్ తాను కూడా శ్రామికులలో ఒకరిని అని తెలిపేందుకు ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో ఖాకి డ్రెస్ లో కనిపించారు.చైతన్య రధ సారధి అయిన హరికృష్ణ కూడా ఖాకిలోనే కనిపించేవారు.అదే వారసత్వాన్ని జూనియర్ ఎన్టీఆర్ కూడా కొనసాగించారు.